संस्कृतदिनाचरणम्

మధ్వసిద్ధాంతపాఠము - తెలుగువారికి సదవకాశము

Atmashrama Patha Telugu 1

మధ్వనవమి సకల మాధ్వులకు పర్వకాలము వంటిది. ఇది జగద్గురువలైన శ్రీమధ్వాచార్యులవారు బదరికాశ్రమమునకు వెడలిన దినము. ఇందు మాధ్వులందరూ సర్వమూల గ్రంథాల పారాయణం, మధ్వవిజయ పారాయణం, అభిషేకంవంటి అనేక పుణ్యకార్యాలని జరపుతూవుంటారు. ఈ వర్షము జనవరి 30 వ తారీఖున మధ్వనవమి పడుచున్నది. ఇటువంటి పవిత్రదినమున సకల తెలుగు మాధ్వులకు శ్రీమధ్వసిద్ధాంతముయొక్క పాఠాన్ని ఆత్మాశ్రమం ఆధ్వర్యంలో ప్రారంభిచుచున్నారు. ఆత్మాశ్రమం ప్రధానాచార్యులైన పం. రాఘవేంద్రాచార్య రాచూరి వారిచే శని-భానువారాలలో పాఠము జరుపబడును. జూం ఆప్ ద్వారా పాఠములు జరుపబడును. 

పాఠముయొక్క విశేషాలు

ఎటువంటి పూర్వపరిచయం అవసరం లేదు

సరళమైన శైలిలో మధ్వశాస్త్రము నేర్పబడును

సంస్కృతభాషా అధ్యయనం, అవసరమైనంత వ్యాకరణ అధ్యయనం

వేద, ఇతిహాస, పురాణముల పరిచయము

మతత్రయ సమీక్షా

ఇతర దర్శనాల పరిచయము 

వేద సూక్తాల అర్థ వివరణము

స్తోత్రార్థ వివరణము

సర్వమూల గ్రంథ పాఠాము

 

ఆసక్తులు 7259670376 ఈ వాట్సప్ నం. కి సంప్రదించగలరు. 


Newsletter